మన్యం టీవీ :ఇల్లందు
సమస్యల పరిష్కారం కోసం గళమెత్తి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పట్టం కట్టాలని ఇల్లందు పట్టణ ఎమ్మెల్సీ కన్వీనర్ సుధీర్ తోబ్లా( బబ్లు) పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కాంక్షిస్తూ శనివారం పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిని పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అక్కిరాజు గణేష్, నబి, రాజేష్ ,మహేందర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: