CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాష్ట్రానికి పాత వైభవం తీసుకొద్దాం

Share it:

 


కాంగ్రెస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం

మన్యం టీవి పినపాక: 

దేశంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని తెలంగాణ ప్రభుత్వం వల్ల ప్రజలు విసిగి వేసారి పోయారని పాత వైభవం తీసుకు రావడం కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని, పినపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం అన్నారు.

మంగళవారం పినపాక మండలం లోని బయ్యారం క్రాస్ రోడ్ లోగల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  ఆయన మాట్లాడుతూ ,ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థి రాములు నాయక్ గెలుపు కాంక్షిస్తూ మండలంలోని ప్రజలను ఉద్దేశించి  గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇచ్చిన హామీలు తుంగలోతొక్కి మళ్లీ ఎన్నికల్లో టిక్కెట్ తెచ్చుకొని ప్రజలను మభ్యపెట్టి విధంగా  మోసము చేయుటకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. డిగ్రీ పట్టభద్రులు ఆలోచన చేయాలని, ఆరు సంవత్సరాలకు వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇచ్చిన హామీలు  నిరుద్యోగులకు 3000, రూపాయలు ,  57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు పింఛన్. రైతులకు రుణమాఫీ,ఇంటింటికీ ఉద్యోగములు అమలు చేశారా అని పట్టభద్రులు ఆలోచించాలన్నారు. ఉద్యోగులకు పిఆర్సి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినారని టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఏడు సంవత్సరాలు గడుస్తున్నదని, ఇంతవరకు పిఆర్సి అమలు పరచలేదని  ,కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నదని అన్నారు.  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్  4 నెంబర్  పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా నాయకులు బోడ రమేష్  ,సుధాకర్ ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: