మన్యం టీవి పినపాక: పినపాక మండలం గడ్డంపల్లి గ్రామానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు పోలే బోయిన అనిల్ కుమార్ కుమార్తె చిరంజీవి వైష్ణవి రత్న ఫిబ్రవరి నెల 28 వ తారీఖున ఖమ్మం లో జరిగిన నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో జూనియర్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది. పోలేబోయిన అనిల్ కుమార్ వ్యాయామ ఉపాధ్యాయుడు కాగా, తన కుమార్తె వైష్ణవి రత్న కు కరాటే శిక్షణ ఇప్పిస్తూ, ఆ దిశగా ఉన్నత స్థానానికి చేరుకునే విధంగా ప్రయత్నిస్తున్నారు. బంగారు పతకం సాధించిన వైష్ణవి రత్న ను మణుగూరు ప్రాంతానికి చెందిన కరాటే శిక్షణ సంస్థ వారు అభినందించారు.
ఈ సందర్భంగా వైష్ణవి రత్న ను పినపాక మండల ప్రాంతానికి చెందిన పలువురు రాజకీయ ,రాజకీయేతర వ్యాపార, విద్యాసంస్థల చెందిన వారు అభినందించారు.
Post A Comment: