మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలకేంద్రం లో పట్టభద్రులను కలిసి మీ ఆడబిడ్డ గా మీ ముందుకు వస్తున్నా ఆదరించండి, మీ ఓటు తో ఆశీర్వదించండి అని పట్టభద్రులను కోరిన ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి భారతి కూరాకుల. పట్టభద్రులను ఉద్దేశించి భారతి కూరాకుల మాట్లాడుతూనిరుద్యోగ భృతి వెంటనే ఇస్తూ, యువతకు స్వయం ఉపాధికై కృషి చేస్తానని,తక్షణమే వివిధ శాఖలలో కాళీలకై ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేలా వయసు ప్రామాణికంగా ఉద్యోగభర్తీకై కృషి చేస్తానని,
ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పీ ఆర్ సీ, ఐఆర్, డీ ఏ, విధి విధానాలకు అనుకూలంగా ప్రభుత్వం ఉండాలి, టీచర్ల ఎన్నికలలో ప్రైవేట్ టీచర్లకు కూడ ప్రాతినిధ్యం ఉండేలా చూస్తానని, పరిశ్రమలు స్థాపించి, ఉద్యోగాలు కల్పించాలని బయ్యారం ఉక్కు మానుకోట హక్కు అనినినదించారు. విద్యావ్యవస్థ కుంటుపడుతున్న తరుణంలో భోధన, భోధనేతర సిబ్బందిని వెంటనే నియమించాలని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకొనుటకు మండలి లో తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడుతానని చెప్పారు. కాంట్రాక్టు, పార్ట్ టైం నడిపిస్తూ నిరుద్యోగులను మోసం చెయ్యడమే కాకుండా విద్యారంగాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు అని భారతి కూరకుల పేర్కొన్నారు. మీ ఆడబిడ్డ గా మీ ముందుకు వచ్చాను మీమొదటి ప్రాధాన్యత ఓటు తో ఆశీర్వధించి చట్ట సభల్లోకి పంపించండి అని అభ్యర్ధించారు.
Post A Comment: