ఉట్నూర్ మన్యం టీవీ ప్రతినిధి.
అదిలాబాద్ జిల్లాలో రామ్లీలా మైదానంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా సదస్సులో కనకరాజు పద్మశ్రీ అవార్డు గ్రహీతను సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అన్యాయాలు వేధింపులు దినోత్సవం తో మహిళలపై గౌరవం పెరగాలని సూచించారు.ఆత్రం సుగుణ ఆదివాసీ మహిళ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ నేడు ఆధునిక వ్యవస్థలో విద్యా వ్యవస్థ బాగా విస్తరించిన మహిళలపై గౌరవం తగ్గుతుందని పేర్కొన్నారు. ఆదివాసి మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెంధోర్ పుష్పరణి మాట్లాడుతూ నేడు అనేక రంగాలలో మహిళలు అభివృద్ధి వైపు వస్తున్న నేటికి అనేక రంగాలలో వారు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు రాజకీయ ఆర్థిక వ్యాపార రంగాలలో చాలా వెనుకబడి ఉన్నారు అని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో మహిళా నేతలు జడ్పీటీసీలు,ఎంపీటీసీలు, సర్పంచ్లుఅలాగే తుడం దెబ్బ అధ్యక్షులు గోడం గణేష్ ,తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బుపురావు మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Post A Comment: