CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న కూనవారం పోడు రైతులు

Share it:

 


👉  వెనుదిరిగిన ఫారెస్ట్ సిబ్బంది

👉విప్ రేగా భరోసా పొడుసాగుదారులకు కొండంత అండగా నిలుస్తోంది.

మన్యం టీవీ, మణుగూరు:

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామంలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమంలో రైతుల పోడు భూములను బలవంతంగా లాకొనుటకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కూనవరం లో గల రేగుల గండి అటవీ ప్రాంతంలో పోడు సాగు చేసుకుంటున్న ఆదివాసి ప్రజల దగ్గరకు ఎఫ్ డి ఓ, డిఆర్ఓ లు తమ సిబ్బంది తో వచ్చి ఇది ఫారెస్ట్ భూమి ఇందులో మొక్కలు నాటాలని దౌర్జన్యం చేస్తుండగా... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే  రేగా కాంతారావు  ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని బాబురావు,పోడు రైతులు తమ భూముల్లో మొక్కలు నాటో దని ఫారెస్ట్ అధికారులను వేడుకున్నారు.  ఆదివాసి లు సాగుచేసుకుంటున్న పోడు భూములు ఒక్క గుంట భూమి కూడా ఇవ్వమని... మా పై ఎన్ని కేసులు పెట్టండి జైలు కైనా వెళతాం... ప్రాణాలైనా ఇస్తాం కానీ మాభూమి మాత్రం ఇచ్చేది లేదని తెగేసి చెప్పడంతో  ఫారెస్ట్ అధికారులు వెనుదిరిగారు. మరికొద్ది రోజుల్లో విప్, పినపాక ఎమ్మెల్యే  రేగా కాంతారావు  సీఎం కేసీఆర్ ని పినపాక పర్యటనకు తీసుకువచ్చి రైతులకు కు పోడు భూమి పట్టాలు ఇప్పించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ ఎన్నిక సమ్మయ్య , కామరాజు, ముసలయ్య, రామదాసు, యేనిక సారయ్య ,డ్రైవర్ సమ్మయ్య, ఏనిక లక్ష్మి కాంతమ్మ కసులమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: