మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు,అశ్వాపురం మండలాల పరిధిలో ని రేగుల గండి లో సోమవారం ఘనంగా శ్రీ భవానీ లింగమంతుల స్వామి జాతర కొనసాగుతోంది.ఈ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాదవులు,భక్తులు స్వామీ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ జాతర లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన జడ్పీటీసి పొశం నర్సింహారావు, అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత, మణుగూరు ఎంపీడీఓ పి.వెంకటేశ్వర్లు,మణుగూరు మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు ఏనిక ప్రసాద్, సర్పంచ్ లు బచ్చల భారతి, బొగ్గం రజిత,కొమరం జంపేశ్వరి,ఉప సర్పంచ్ ప్రబుదాస్,అశ్వాపురం మండల అధ్యక్షులు కోడి. అమరేంధర్,మణుగూరు టౌన్ అధ్యక్షులు అడపా. అప్పారావు,నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,టిఆర్ఎస్ నాయకులు,తంత్రపల్లి కృష్ణ,యువజన నాయకులు ఆలయ కమిటీ సభ్యులు బొబ్బాల నగేష్ యాదవ్, మేకల ఆది లింగయ్య యాదవ్,మారుతి శ్రీనివాస్ యాదవ్,బొల్లు.రామకృష్ణ, గంట గోవర్ధన్,సోషల్ మీడియా ఇంచార్జి శ్యామ్ సుందర్,సురేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: