మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తూడి భగవాన్ రెడ్డి
మన్యం టీవీ మంగపేట.
రానున్న ఇరవై రోజుల్లో ధాన్యం పంట రైతుల చేతికి వస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు తూడి భగవాన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.పంట చేతికి వచ్చే సమయంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను రద్దుచేయడం సరియైన పద్దతి కాదు అని వారు ఆరోపించారు.పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందా లేదా అన్న సందేహాలు రైతులలో వెలుబడుతున్నాయి.కావున ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలపై రైతులకు ఇవ్వాలని అదేవిదంగా రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని భగవాన్ రెడ్డి డిమాండ్ చేసాడు.
Post A Comment: