ఏఎస్పి ఏవిఎస్పి పిలుపు
మన్యంటీవీ ఏటూరునాగారం:
రేపటి ఐటిడిఏ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తాడ్వాయి మండలం కామారం గ్రామంలో ఏఎస్ పి జిల్లా కార్యదర్శి మెట్టి వేణుగోపాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఏఎస్ పి జిల్లా అధ్యక్షులు కొర్ని బెల్లి నాగేశ్వరరావు హాజరై మాట్లాడుతూ ఆదివాసి చట్టాలను నిర్విరామం చేస్తూ ఆదివాసి హక్కులను కాలరాస్తూ ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసి మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే ఏ ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూప నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏజెన్సీలో1/59,1/70 చట్టాల కి అధికారులు తూట్లు పొడుస్తూ గిరిజనేతరులకు అధికార పార్టీ నాయకులు ముడుపుల కు ఆశపడి ఆదివాసీ సమాజానికి ద్రోహం చేసే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. 5వ షెడ్యూల్ ఏరియాలో ఆదివాసీలకు కేటాయించిన చట్టాలను అధికారులు నీరుగారుస్తున్నారని అన్నారు. జీవో నెంబర్ 3 ను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా కడుతున్న గిరిజనేతరుల భవనాల పై ఎల్ ఆర్ టి ఆర్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన చట్టాలను కాపాడుకోవాలంటే అధికారుల పై యుద్ధానికి సిద్ధం కావాలని రేపటి ముట్టడి ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు సొందె మల్లుదొర, మండల నాయకులు తాటి రామచందర్, కవిత సర్పంచులు దేవేందర్, కళ్యాణి తదితర నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: