మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్లెలమడుగు గ్రామా పంచాయతి కార్యాలయం లో సర్పంచ్ కోడి క్రిష్ణవేణి అధ్యక్షతన మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ఎంపీపీ ముత్తినేని సుజాత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని ,మహిళా లేకపోతె ఈ సృష్టి లేదని మహిళలు ఒక తల్లిగా,ఒక చెల్లిగా ఒక బార్యగా ఉంటూ ఈ లోకానికి మహిళా ఎన్నో అమూల్యమైన సేవలు అందిస్తుందని,మహిళలు అన్ని రంగాలలో రాణించినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధించినట్లు అని వారు తెలిపారు.అనంతరం అంగన్వాడీ టీచర్లు ఆశ వర్కర్లు ,పంచాయతి కార్మికులకు ,పాలకవర్గ సభ్యులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చావ విరరాఘవులు, మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్ కె ఖదీర్, వార్డుసభ్యులు కమాటం లక్మమ్మ, కడారి దుర్గ,బేతం రమణమ్మ, గొడ్డుగోర్ల వెంకన్న, అంగన్వాడీ టీచర్లు రెడ్డి అరుణ, ఈసంపల్లి నాగమణి, బండారి సాహితీ, రావమ్మా,కోడి దీప్తి, ఆశ వర్కర్లు పిట్టా లక్ష్మి, గుంపెన సుశీల , తెరాస అధ్యక్షులు కోడి అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: