తెలంగాణ పట్టభద్రుల సంఘం
మన్యం టీవీ మంగపేట
మండలంలోని అనేక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగపేట తెలంగాణ పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రోఫెషర్ కోదండరామ్ కు వినతి పత్రంను ఆ పార్టీ నాయకుడు పొలాసాని అశోక్ రెడ్డికి అందజేశారు.అనంతరం పట్టభద్రుల సంఘం అధ్యక్షుడు గాంధేర్ల నర్సింహారావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఓటర్లు తమ అమూల్యమైన ఓటును అమ్ముకో వద్దని,ఓటు హక్కు మన జన్మ హక్కు అని ఓటు వేసే ముందు ప్రతి పట్టభద్రుడు ఆలోచించి ఓటు వేయలని నీ ఓటుని తల రాత మార్చుతుందని అన్నారు.మన హక్కులను కాల రాస్తున్నా రాజకీయ పార్టీలను బహిష్కరించా లని మండలం లోని పలు సమస్యలను పరిష్కరించాలని అందులోనూ ముఖ్యంగా ఏజెన్సీ నాన్ ఏజెన్సీ సమస్య వల్ల స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కరువు గ్రామాల అభివృద్ధి కుంటు పడుతుంది ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీ నుంచి వచ్చే లోన్ బ్యాంకు లింక్ లేకుండా ఇవ్వాలని మండలం కేంద్రంలో బ్యాంకు బస్ స్టాండు నిర్మాణం చేయాలని లైబ్రరీ టాయిలేట్స్ కమ్యూనిటి హల్ ఏర్పాటు గోదావరికి కరకట్ట నిర్మాణం ఖాళీగా ఉన్న శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సునారి నాగేంద్ర బాబు,జాడి సాంబశివరావు,బసారి నాగార్జున,లక్ష్మీ నారాయణ,సతీష్,రమేష్,సంతోష్,శివ ప్రసాద్,పూసల నరసింహరావు,జ్వాల యూత్ అధ్యక్షుడు నరేష్,పాల్గొన్నారు.
Post A Comment: