మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం,నల్గొండ, వరంగల్,పట్టభద్రుల ఎమ్మెల్సీ టీజేఎస్ పార్టీ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం మణుగూరు మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజి,జూనియర్ కాలేజీ,హై స్కూల్,బిటిపిఎస్,సింగరేణి హై స్కూల్,పలు చోట్ల పర్యటించి పట్టభద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు 7వ నెంబర్ పై వేసి గెలిపించి మార్పుకు శ్రీకారం చుట్టాలని పట్టభద్రులను కోరారు.ఈ సందర్భంగా పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలి అని,ప్రశ్నించే అభ్యర్థి ని గెలిపించాలని,శాసనమండలి కి పంపించాలి అని కోరారు.ఈ ప్రచారంలో టీజేఎస్,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ,టీడీపీ, తుడుందెబ్బ నాయకులు పగడాల కరుణాకర్ రెడ్డి,ఆర్ మధుసూదన్ రెడ్డి,వట్టం నారాయణ,కోటి,మల్లెల రామనాథం,నబి,దేవదానం శివరాం,వాసిరెడ్డి.చలపతిరావు,మధుసూదన్,కూచిపూడి బాబు,నారాయణ,సత్యలింగం,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: