గుమస్తా అతిగా మద్యపానం సేవించడమే కారణం
ముగ్గురు వ్యక్తుల కు తృటిలో తప్పిన ప్రమాదం
గుమస్తా ను తొలగించాలని గ్రామస్తులు అవేదాన.
మన్యం టీవీ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం లోని గొల్ల గూడెం గ్రామంలో పంచాయతీకి సంబంధించిన ట్రాక్టర్ అదుపుతప్పి ఇంట్లోకి చొరబడింది. వివరాల్లోకి వెళితే
గొల్లగూడెం పంచాయతీకి సంబంధించినహరితహారం ట్రాక్టర్ అదుపుతప్పి గ్రామంలోని చెట్టి క్రిష్ణ ఇంట్లోకి దూసుకెళ్లింది. చెట్టి పుల్లయ్య ఇంట్లో మాట్లాడుతున్న ఎల్ల బోయిన నరసయ్య కు చేయి మరో ఇద్దరికీ గాయాలు అయ్యాయి. వారిని 108 లో ఆసుపత్రికి తరలించారు. గుమస్తా మోడెం సంజీవ్ అతిగా మద్యం సేవించడం వలన ఈ ప్రమాదానికి కారణం అని గ్రామస్థులు వాపోతున్నారు. గతంలో సర్పంచ్ కు ఈ విషయం గురించి చాలాసార్లు తెలియజేశామని సర్పంచ్ ,కార్యదర్శి ఇతని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించటం వలన ఈ ప్రమాదం జరిగిందని ప్రజలు అంటున్నారు. ట్రాక్టరు ఇంట్లోకి దూసుకెళ్లిన డం వలన ఆటో , ద్విచక్ర వాహనం ధ్వంసం అయ్యాయి అని గ్రామపంచాయతీ ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా పంచాయతీ సర్పంచ్ విజయకుమార్, పంచాయతీ సెక్రెటరీ శ్రీనాథ్ లు గుమస్తా విషయం గురించి కాస్త ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.
Post A Comment: