CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన చట్టాలను అమలు చేయాలి

Share it:

 


మన్యంటీవీ ఏటూరునాగారం:


మారుమూల ఏజెన్సీ గిరిజన గ్రామీణ ప్రాంతాలలో ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకులు పూనెం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని వై జంక్షన్ నుండి సోమవారం  ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ప్లే కార్డులు బ్యానర్లు చేత భూని నినాదాలు చేస్తూ ర్యాలీగా ఐటిడిఎ కార్యాలయానికి చేరుకొని తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ,  ఐటిడిఎ కార్యాలయాన్ని ముట్టడించారు.

 ఈ సందర్భంగా  సంక్షేమ పరిషత్ నాయకులు మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ భూభాగంలో 1/ 70 చట్టం, పీసా చట్టాలను అమలు చేయాలని, చట్టాలకు విరుద్ధంగా ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న బహుళ అంతస్తుల నిర్మాణాలు భూ విక్రయ లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో నిర్మాణం చేపట్టిన బహుళ అంతస్తుల నిర్మాణాలపై ఎల్ టి ఆర్ కేసు నమోదు చేయాలని అన్నారు. అటవీశాఖ అధికారులు ఆదివాసుల పై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ దందా నిర్వహిస్తున్న గిరిజనేతర లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐటిడిఏ పీవో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, ములుగు జిల్లా అధ్యక్షులు కొర్ని బెల్లి నాగేశ్వరరావు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు రాజేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు నరసింహారావు, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్, భద్రాచలం డివిజన్ అధ్యక్షులు సొందే మల్లుదొర, గిరిజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: