రామగుండంలో ఎరువుల కర్మాగారం ట్రయల్రన్ను అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఈవో నిర్లప్ సింగ్ రాయ్ హాజరయ్యారు. ప్లాంట్ పూర్తిస్థాయి పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ట్రయల్రన్ ప్రారంభించినట్లు నిర్లప్ సింగ్ రాయ్ ప్రకటించారు. ఈ పరిశ్రమలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేపనూనె పూత పూసిన యూరియా ఉత్పత్తి చేయనున్నారు. మార్చిలో రామగుండం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు యూరియా సరఫరా కానుంది. అయితే ఈ వాణిజ్య ఉత్పత్తిని మార్చిలో ప్రారంభించనున్నట్లు నిర్లప్ సింగ్ రాయ్ వెల్లడించారు.
Navigation
Post A Comment: