మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అశ్వారావుపేట నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ తాటి వెంకటేశ్వర్లు. మండల వ్యాప్తంగా ఉన్న పలు రెసిడెన్షియల్ స్కూల్స్ ,జెడ్పి స్కూల్ లో పనిచేసే ఉపాధ్యాయులను కలిసి వారి ప్రాధాన్యత ఓటును టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి వేయవలసిందిగా కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు, మండల నాయకులు భారత రాంబాబు,కృష్ణారెడ్డి,జంగాల ఉమా, కొత్తూరు వెంకటేశ్వరరావు, పెద్దారపు నాగరాజు, తదితర నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: