మన్యం టీవీ, ములకలపల్లి మండలం:
ములకలపల్లి మండల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి జయసారధి రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, సీపీఎం సీపీఐ రాష్ర్ట నాయకులు పోతినేని సుదర్శన్, భాగం హేమంత రావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ములకలపల్లిలో పట్ట భద్రులతో అభ్యర్థి జయసారధి రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జయసారథి రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీగా తనను గెలిపించి,శాసన మండలికి పంపితే బడుగు,బలహీన వర్గాల గోతుకనై ప్రశ్నస్తానని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్,కేంద్రంలో మోడీ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని అన్నారు. గడిచిన ఆరేళ్ళ లో ఎమ్మెల్సీ గా పల్లా ఒరగబెట్టింది ఏమి లేదని విమర్షించారు. ఏనాడు నిరుద్యోగుల సమస్య లపై మాట్లాడింది లేదన్నారు. పట్టభద్రులు ఆలోచించి ఓటు వేసి బీజేపీ,టి.ఆర్.ఎస్ పార్టీ లకు బుద్ధి చెప్పాలన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండేది వారి సమస్యల పై పోరాటం చేసేది వామపక్షాలు మాత్రమే అన్నారు. టీచర్ల సమస్యలపై కాంట్రాక్టు లెక్చరర్లు సమస్యలపై ఉద్యోగుల సమస్యలపై గొంతెత్తి గర్జిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా,సీపీఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు నరాటి.ప్రాసాద్,సిపిఎం రాష్ట్ర నాయకులు ఎజె రమేష్, మచ్చ వెంకటేశ్వర్లు ,యూ.టి.ఎఫ్ జిల్లా కార్యదర్శి తేజావత్ శ్రీనివాసరావు,సీపీఐ నాయకులు దేవభక్తిని కృష్ణ, నరాటి ప్రసాద్ ,జబ్బార్, గజ్జల.సందీప్, యూసుఫ్,ఈర్ల రామ్మోహన్, సీపీఎం పార్టీ నాయకులు ఉకంటి రవి,పోడియం వెంకటేశ్వర్లు, నిమ్మల మధు,ఎమ్ఆర్పిఎస్ నాయకులు కాల నరసింహారావు,మరియు పట్టభద్రులు పాల్గొన్నారు.
Post A Comment: