మన్యంటీవీ ఏటూరునాగారం:
ఏటూరునాగారం మండల వైఎస్సార్సీపీ నాయకులు యం డి ఖైసర్ పాషా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.త్వరలో తెలంగాణ లో రాజన్న రాజ్యాన్ని తీసుకువస్తామని అదే విధంగా విద్యార్థులు, రైతులు సైతం సంతోషంగా లేరని త్వరలో నూతన పార్టీని పెట్టనున్నట్లు తెలిపారు.ఈ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు,వైఎస్సార్ అభిమానులు అందరూ కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దబోయిన సమ్మయ్య,సయ్యద్,షబ్బీర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: