మన్యం టీవి, పినపాక: పినపాక మండల ఎం పి పి గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో ఖమ్మం -వరంగల్ -నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం, జానంపేట గ్రామంలో ప్రచారం ప్రారంభించారు. టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీశ్ రెడ్డి సహకారంతో ప్రచారం చేస్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయులను, పట్టభద్రులను కలుసుకుని,పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించ వలసినదిగా ప్రచారం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు పగడాల సతీశ్ రెడ్డి, పి ఎ సి ఎస్ చైర్మన్ రవి వర్మ , ఆత్మ డైరెక్టర్ భద్రయ్య,జానంపేట సర్పంచ్ మహేష్, టి ఆర్ ఎస్ కార్యకర్త వెంకటేశ్వర్ రెడ్డి,ఉపాధ్యాయులు అనిల్ కుమార్, రమణ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: