మన్యం టీవీ పినపాక: పినపాక మండలం గడ్డంపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పడిగ శివ శంకర్ అనారోగ్యంతో మరణించినారు.పినపాక మండలం లోని పొట్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.కొద్ది రోజుల క్రితం నుంచి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆయన మృతి పట్ల పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, గడ్డం పల్లి సర్పంచ్ కలివేటి సునీల్ కుమార్, పొట్లపల్లి సర్పంచ్ కల్యాణి,ఉపాధ్యాయ సంఘాల నాయకులు అనిల్ కుమార్,ఆదివాసి ఐకాస మండల అధ్యక్షులు శ్రీనివాస్, ఆట అధ్యక్షులు సోలం అశోక్ లు వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Post A Comment: