మన్యం మీడియా,అన్నపురెడ్డిపల్లి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం,అన్నపురెడ్డిపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల విస్త్రత ప్రచారం నిర్వహించారు.ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సభావత్ రాములు నాయక్ గెలుపును కాంక్షిస్తూ, కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు బాణావత్ భీముడు ఆధ్వర్యంలో పార్టీ మండల నాయకులు మండలంలోని పలు ప్రైవేటు,ప్రభుత్వ కళాశాలలా అధ్యాపకులను, గుంపెన గ్రామపంచాయతీలోని కొత్తూరు,గుంపెన హెచ్ కాలనీ గ్రామలలోని పట్టభద్రులను కలిసి,తమ అమూల్యమైన ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేయవల్సిందిగా కోరారు.ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల సీనియర్ నాయకులు సుభాని, కోటేశ్వరరావు ,కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల యువజన నాయకులు పాషా, కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు అహ్మద్ ,మండల నాయకులు చల్లా పుల్లయ్య,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: