మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ బొమ్మ సెంటర్,బాపన కుంట, శివలింగాపురం.వార్డుల యందు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కై టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి.సాగర్ యాదవ్ విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టభద్రుల ను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో యువజన నాయకులు బోశెట్టి.రవి ప్రసాద్,గుర్రం.సృజన్, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: