మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు,అశ్వాపురం మండలాల పరిధిలో ని రేగుల గండి లో సోమవారం శ్రీ భవానీ లింగమంతుల స్వామి జాతర ఘనంగా జరిగింది.ఈ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.యాదవులు,భక్తులు స్వామీ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ జాతర లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన నియోజకవర్గ యువజన అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్,భక్తులతో కలిసి మొక్కులు చెల్లించారు.గజ్జ కట్టి,కత్తులతో నాట్యం చేసి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.ఈ కార్యక్రమంలో యువజన నాయకులు గుర్రం సృజన్, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: