మన్యం టివి కడెం :
కడెం మండలంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు తమతమ పంట క్షేత్రాలలో విద్యుత్ మోటార్ల వద్ద కెపాసిటర్లను బిగించుకోవాలని కడెం ఏ.ఇ సుమన్ రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మండలం లోని చిన్నబెల్లాల్ , చిట్యాల్, నర్సింగపూర్, తదితర గ్రామాలలో విద్యుత్ శాఖ అధికారులు పర్యటించారు ఈ సందర్భంగా ఏ.ఇ సుమన్ మాట్లాడుతూ రైతులు తమ పంట పొలాల్లో విద్యుత్ కెపాసిటర్లను బిగించుకున్నట్లు అయితే విద్యుత్ సరఫరా లో ఏర్పడ్డ వోల్టేజ్ ఎచ్చు తగ్గులు నియంత్రణ మోటార్ లు ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోకుండా కాపాడుకోవచ్చు అన్నారు విద్యుత్ లోడ్ ను తగ్గించుట పలు రకాల ఉపయోగాలపై గ్రామ రైతులకు విద్యుత్ శాఖ అధికారి సుమన్ అవగాహన కల్పించారు వ్యవసాయ విద్యుత్ మోటార్ కనెక్షన్ వారు బిల్లులు చెల్లించని వారి కనెక్షన్ లు తొలగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో లైన్ మెన్ సదానందం , వివిధ గ్రామాల సర్పంచ్ లు రైతులు పాల్గొన్నారు.
Post A Comment: