CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూలూరుపాడులో 181 కిలోల గంజాయి స్వాధీనం...

Share it:

 


సుమారు 25 లక్షల విలువ

ఆటో డ్రైవర్ గోపాలరావు అరెస్ట్.. ఓనర్ రాజాలు పరారీ..!

జిల్లా అడిషనల్ ఎస్పీ రోహిత్ రాజు...



మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని చుండ్రుగొండ క్రాస్ రోడ్డు వద్ద ఎస్సై శ్రీకాంత్ తన సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆటోలో తరలిస్తున్న 88 ప్యాకేట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. అనుమానాస్పదంగా ఉన్న నంబరు ప్లేటు లేని ఆటోను పోలీస్ స్టేషనుకు తరలించి పరిశీలించారు. ఆటో పై భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలతో పాటు సౌండ్ బాక్సులో గంజాయి ప్యాకెట్లు లభ్యం కావడంతో విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఒరిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి నుంచి ఇక్కడకు ఆటోలో గంజాయిని తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం సాగిస్తునట్లు తెలిపారు. పట్టుబడిన గంజాయిని స్వాధీనం చేసుకుని.. ఆటోను సీజ్ చేసినట్లు తెలిపారు. రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గోపాలరావును అరెస్టు చేయగా.. నల్లబండబోడు గ్రామానికి చెందిన ఓనర్ గడ్డం రాజాలు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎటువంటి వారినైనా సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు.. ఎస్సై శ్రీకాంత్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: