మన్యం టీవీ,పినపాక:పినపాక మండలంలో గోపాలరావుపేట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పీసీసీ సభ్యులు స్వతంత్ర సమరయోధులు బొలిశెట్టి నరసింహయ్య భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరుపున భద్రాచలం శాసన సభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య అధ్యక్షతన గోపాలరావుపేట గ్రామం లో ఏర్పాటు చేసిన బొలిశెట్టి నరసింహయ్య సంతాప సభకు పినపాక మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం గారి ఆధ్వర్యంలో ఈ బయ్యారం క్రాస్-రోడ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి గోపాలరావుపేట గ్రామం వరకు బొలిశెట్టి నరసింహయ్య ఇంటి వరకు 100ద్విచక్ర వాహనాలతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ...ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఉపాధ్యక్షులు కొంబత్తిని శ్రీను, జనరల్ సెక్రటరీ జక్క వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు పూనెం వెంకటేశ్వర్లు,కార్యదర్శి గీద సాయి, మండల మహిళా అధ్యక్షురాలు మాజీ సర్పంచ్ బొగ్గం నాగమణి , జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు చందా లింగయ్య , దుర్గా ప్రసాద్ , కేశవరెడ్డి , మైనారిటీ సెల్ అధ్యక్షులు మహ్మద్ ఖాన్ , జిల్లా కాంగ్రెస్ నాయకులు బోడ రమేష్ , పినపాక నియోజకవర్గం యువజన నాయకులు కొర్సా ఆనంద్ , బూర్గంపహాడ్ మండల నాయకులు సుధాకర్ రెడ్డి , మణుగూరు మండల అధ్యక్షులు గురిజాల గోపి , గుండాల మండల నాయకులు ముత్యమాచారి , ముత్తయ్య గారు, వాంకుడోతు రమేష్ , పినపాక మండల కార్యవర్గ సభ్యులు మునిగేలా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: