CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా విస్తృత స్థాయి సమావేశం విజయవంతం చేయాలి

Share it:

 


మన్యం టివి:కరకగూడెం.తెలంగాణ  రాష్ట్ర  సమితి  విద్యార్థి విభాగం(టిఆర్ఎస్వి)ఆధ్వర్యంలో ఆదివారం కొత్తగూడెం క్లబ్ నందు ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా  విస్తృత స్థాయి సమావేశం విజయవంతం చేయాలని టిఆర్ఎస్వి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎన్ రాజు తెలిపారు.కరకగూడెం మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు టిఆర్ఎస్వి ముఖ్య కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న ఖమ్మం,వరంగల్,నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ విద్యావేత్త పల్లా రాజేశ్వర రెడ్డి గెలుపు కోసం గ్రాడ్యుయేట్ ఓట్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా టిఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్,రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మాజీ మంత్రివర్యులు,కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు,ఇల్లందు శాసనసభ్యురాలు శ్రీమతి హరిప్రియ నాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య,టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా ఇంచార్జీ తాత మధు,జిల్లా పరిషత్ వైస్ చెర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు,జిల్లా గ్రంధాలయం సంస్థ చెర్మన్ దిండిగాల రాజేందర్,టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు,తెరాస ముఖ్య నాయకులు, టిఆర్ఎస్వీ భాద్యులు పాల్గొంటారని తెలిపారు. తెరాస శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  కోరారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి పినపాక నియోజకవర్గ అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,కరకగూడెం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య,కరకగూడెం,పినపాక మండలాల అధ్యక్షులు మామిళ్ళ శ్రీకాంత్,యాంపాటీ సందీప్ రెడ్డి,కరకగూడెం ఉప సర్పంచ్ రావుల రవి,పంది సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: