మండల ప్రధాన కార్యదర్శి కొంకతి సాంబశివరావు
మన్యం టీవీ మంగపేట.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు ధరలు పెంచుటలో నువ్వా? నేనా? అన్న తీరుగా ధరలు పోటీపడి మరి పెంచుతున్నారు.కొనపోతే కొరవి అన్నట్లుగా వీరి పరిపాలనలో ఏమి కొనేటట్లులేదు, ఏమి కొనేటట్లు లేదు.పేదవారి నిత్యావసర వస్తువులైన వంటనూనె, గ్యాస్ విపరీతంగా పెంచుతున్నారు సిలిండర్ ధర 850 రూపాయలు బ్లాక్ లో 1000 రూపాయలు, వంట నూనె ఒక కేజీ 150 రూపాయలు, ఒక లీటరు 94.79. రూపాయలు ప్రస్తుతం ఇవి పెరగవని గ్యారంటీ కూడా లేదు. ఇవే కాకుండా నిత్యావసర వస్తువులు అయిన అన్ని వస్తువులు విపరీతంగా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు.ప్రస్తుతం ఉన్న ధరలు గతం పరిపాలన లో ఎప్పుడు చూసిన దాఖలాలు లేవు. ప్రజల సంక్షేమాన్ని మరిచి లేని లేనోళ్ల కడుపు కొట్టి ఉన్నోళ్ల కడుపు నింపుతున్నారు.మాట్లాడితే ధరల పాపం పాత ప్రభుత్వాలదే అంటున్నారు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇక నైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ది తెచ్చుకొని ధరలు వెంటనే తగ్గించాలి లేదంటే ప్రజలు మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో ఇంట్లో కూర్చుబెట్టడం కాయం.ఇదే రీతిలో మీ పరిపాలన సాగితే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని మంగపేట మండల ప్రధాన కార్యదర్శి కొంకతి సాంబశివరావు తెలియజేసారు.
Post A Comment: