మన్యంటీవీ ఏటూరునాగారం
ఏటూరునాగారం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పార్టీ సభ్యత్వ కార్యక్రమం పురస్కరించుకొని ఏటూరునాగారం మండలంలోని మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ మరియు సభ్యత్వ నమోదు ఇంచార్జిలు ఆధ్వర్యంలో ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డు ఏడవ వార్డు వివిధ వార్డుల్లో క్రియాశీల సభ్యత్వాలు, సాధారణ సభ్యత్వాలు ఇస్తూ టిఆర్ఎస్ కుటుంబంలో చేరిన వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు తెలిపారు. మండల అధ్యక్షుడు మాట్లాడుతూ టిఆర్ఎస్ కుటుంబంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆప్షన్ నెంబర్ వాలీయబీసలీం, ఎంపీపీ అంతటి విజయ నాగరాజు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సర్దార్ పాషా, మండల ఉపాధ్యక్షులు కొమిరి రమేష్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు వావిలాల రాంబాబు, మండల అధికార ప్రతినిధి పెండ్యాల ప్రభాకర్, సభ్యత్వ నమోదు ఇంచార్జి ధనపునేని కిరణ్ కుమార్,యూత్ మండల అధ్యక్షులు కొండాయి చిన్ని, రామ నరసయ్య, కుమ్మరి చంద్రబాబు, జాడి బోజారావు, మండల యువజన నాయకులు కందకట్ల శ్రీనివాస్, తాళ్లపల్లి మోహన్, గాదె నరేష్, లింగా చారి, రాజేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: