పినపాక ప్రాథమిక వ్యవసాయ సంఘం చైర్మన్ రవిశేఖర్ వర్మ
మీడియా టుడే పినపాక ఫిబ్రవరి 27:ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో కార్యవర్గ సమావేశం పిఎసిఎస్ చైర్మన్ వర్మగారి అధ్యక్షతన జరుపబడింది.అందులో ముఖ్యంగా రైతులు తీసుకున్న స్వల్పకాలిక ఋణాలను చెల్లించి బాకీలను రెన్యువల్ చేసుకోవాలని సంఘపరిధిలోని రైతులను కోరారు.అలాగే గతంలో తీసుకున్న గేదెల ఋణములు..ద్విచక్ర వాహనాల ఋణములు, వాయిదాలు, మీరినందున వాటినిఖచ్ఛితంగా కట్టాలని లేనియెడల వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడునని సంఘతీర్మాణం చేయబడినది.మరియు కరకగూడెం మండలం లో ఉన్న స్వంత స్థలంలో ఆఫీసు , ఎరువుల గోదాము కట్టుకొనుటకు గానూ ఖమ్మం జిల్లా కేంద్రసహకార బ్యాంకు నుండి నిధులు కోరుతూ తీర్మానం చేయనైనది. ఈ కార్యక్రమంలో సంఘ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, డైరక్టర్ లు గునిగంటి సమ్మయ్య,రావుల కనక య్య,మద్దం సతీష్,మర్లభూషణం, చిట్టిమల్ల వెంకటనర్సు,సంఘ సి ఈ ఓ చింతల రాంబాబు, సంఘసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: