CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతుల శ్రేయస్సు కోసమే రైతు వేదికలు - జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

Share it:

 



మన్యం టీవీ, బూర్గంపాడు:


బూర్గంపాడు మండల పరిధిలోని మొరంపల్లి బంజర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు శ్రేయస్సు కొరకు నిర్మించిన రైతు వేదికలో శనివారం వ్యవసాయ మరియు అనుబంధ శాఖలపై రైతులకు అవగాహన కల్పించాలనే సంకల్పంతో మండల స్థాయి కమిటీ సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత  మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని,రైతుల శ్రేయస్సు కోసమే రైతు వేదికలు నిర్మించారని రైతులు అందరూ వీటిని వినియోగించుకోవాలి అని తెలిపారు.అదేవిదంగా పంట నాణ్యత ఎరువుల వినియోగం మరియు సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించలని మండల వ్యవసాయ శాఖ అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో రైతు క్లస్టర్ పరిధిలోని సర్పంచులు, ఉపసర్పంచులు,వార్డుసభ్యులు,జిల్లా,మండల,గ్రామ రైతు సమన్వయ సమితి సభ్యులు, ఎడిఎ తాతారావు, ఏవో అనిల్ కుమార్, ఏఈఓ ప్రసాద్ మరియు రైతులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: