మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని రమణక్క పేటలో గ్రామ పంచాయతీ నల్లాలు, మిషన్ భగీరధ నల్లాలు ఎక్కడచూసినా లీకిజిల మయమే, పట్టించుకొనేవారే లేరని ప్రజలు వాపోతున్నారు. కొంతమంది ప్రజలు నల్లాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే వస్తున్నాయి మిగతా ప్రాంతాలలో లేవని చెబుతున్నారు. లీకేజీలు ఒక దగ్గర కాదు అన్ని చోట్ల అలాగే ఉంది పరిస్థితి, ఒక దగ్గర సరిచేస్తే మరొక దగ్గర లీకు అవుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణాలు పనిలో, వాడే వస్తువులలో నాణ్యతప్రమాణాలు సరిగా లోపించిడమే. నాణ్యత లేని వస్తువులు వాడితే ఎన్ని సార్లు మరమ్మత్తులు చేసిన ప్రయోజనం ఉండదని ప్రజలు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరధ లీకేజీలు, నీళ్లు రాక అవస్థలుపడుతున్నారు. వీటన్నిటిని పరిశీలించిన ప్రజలు ఓపిక నశించి గ్రామ పంచాయతీ సిబ్బందిని అడిగితే చేస్తాము, చూస్తాము అంటున్నారని, గ్రామ పంచాయతీ వారి నిర్వహణ లోపం, అలసత్వం బాగా ఉందని ప్రజలు చెబుతున్నారు. ఇకనైనా ప్రజలకు నాణ్యత ప్రమాణాలతో కూడిన సేవలనుఅందిస్తారని రమణక్కపేట గ్రామ పంచాయతీ ప్రజలు ఆశిస్తున్నారు.
Post A Comment: