CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముమ్మరంగా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు

Share it:

 


మన్యంటీవీ ఏటూరునాగారం:


 కన్నాయిగూడెం మండలంలో టిఆర్ఎస్ పార్టీ  అధ్యక్షులు మండలసుబ్బుల సమ్మయ్య  ఆధ్వర్యంలో ముప్పనపల్లి గ్రామంలో పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ములుగు భూపాలపల్లి జిల్లాల రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, కన్నాయిగూడెం మండలం సభ్యత్వాల ఇంచార్జి ఆలం రామ్మూర్తి  ముఖ్య అతిథులుగా పాల్గొని ముందుగా పార్టీ ముఖ్య కార్యకర్తలకు సభ్యత్వాలను అందించారు. ఈ సంధర్భంగా పల్లా బుచ్చయ్య మాట్లాడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. రైతుబంధు, రైతు భీమా, 24 గంటల కరెంట్, నిరుద్యోగులకు అధికంగా ఉద్యోగాల కల్పించడం జరిగిందని అన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండలంలోని పట్టబడ్రులందరు పల్లా రాజేశ్వరరెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో  మండల ఉపాధ్యక్షుడు చిట్టెం శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షుడు చింతకుట్ల వెంకటయ్య, గ్రామ సర్పంచ్ చిదరి మౌనికసుమన్,  మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ పొండెం శోభన్, మండల యూత్ అధ్యక్షుడు నేరెడ్ల అశోక్ , కొలిపాక లక్మినారాయణ, అబ్బు సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: