CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉పదవీ విరమణ పొందబోతున్న ముగ్గురు పోలీసు అధికారులను సన్మానించిన భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్.

Share it:

 



మన్యం టీవీ కొత్తగూడెం


ఈ నెల 28 వ తేదీన పదవీ విరమణ పొందబోతున్న కొత్తగూడెం 2 టౌన్ ఎస్సై రాంబాబు,కొత్తగూడెం 3టౌన్ మహిళా ఏఎస్సై రత్నమాల మరియు భద్రాచలం పట్టణ డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ఎస్సై దాసయ్య లను ఈ రోజు జిల్లా ఎస్పీ  సునీల్ దత్ ఐపీఎస్ తన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.మూడు దశాబ్దాలుగా పోలీసుశాఖకు ఎనలేని సేవలందిస్తూ పదవీ విరమణ పొందుతున్న ముగ్గురు పోలీసు అధికారులకు ఎస్పీ ధన్యవాదాలు తెలియజేసారు. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలంగా పనిచేయడానికి అన్ని విధాలా సహకరించిన వారి కుటుంబ సభ్యులకు  కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆర్ఐ కామరాజు పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: