మన్యం టీవీ,మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని రామానుజవరం గ్రామపంచాయతీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు కొత్త మల్లె పల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి. డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం కాంక్షిస్తూ విస్తృత ప్రచారం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఎమ్మెల్సీ ఓటు హక్కు కలిగిన అభ్యర్థులు దగ్గరికి వెళ్లి అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యత గా పల్లా రాజేశ్వర్ రెడ్డి కి వేయాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు.బోయిళ్ళ రాజు, మండారి.సతీష్,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు.కట్టా నర్సయ్య,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: