మన్యంటీవీ ఏటూరునాగారం:
ములుగు నియోజకవర్గ ఇన్చార్జి ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ జగదీష్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా లో ఎదురులేని శక్తిగా ఎదుగుతుందని, ములుగు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ అన్నారు. ములుగు మండల కేంద్రంలో ఎంపీపీ అతిథిగృహంలో ములుగు మండల పార్టీ శ్రేణులు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలందరూ పార్టీ పటిష్టత కోసం కష్టపడుతూ ప్రతిజ్ఞ చేశారు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిపించడం కోసం సాయశక్తులా కృషి చేస్తామని ఆయన తెలిపారు. పార్టీలో ఎలాంటి ఈభేదాలు లెవ్వని ఎవరికి కూడా సొంత ఎజెండాలు లేవని తమ అంతా గులాబీ జెండా కింద నియోజకవర్గ ఇన్చార్జి కనుసన్నుల్లోనే బేధాభిప్రాయాలు లేకుండా పని చేస్తున్నామని అన్నారు. ఎంతమంది స్వార్థపూరిత రాజకీయాలకోసం పార్టీ పైన బురద చల్లడం ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పని చేయడం కోసం నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు కార్యకర్తలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు పల్లా బుచ్చయ్య ,మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అల్లం రామ్మూర్తి, ఎంపీపీ గడ్రకోట శ్రీదేవి, జెడ్పిటిసి సకినాల భవాని, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు పోరిక విజయ రామ్ నాయక్, ఆత్మ చైర్మన్ ఓదేలు, ఎంపీటీసీలు సమ్మయ్య, శ్రీను, రాజు, జిల్లా పరిషత్ కోఆప్షన్ నెంబర్ రియాజ్ మీర్జా, టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి బుడతనపల్లి మోహన్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మెరుగు సంతోష్, మండల ఉపాధ్యక్షులు శీలం మధు, సీనియర్ నాయకులు రాజు, సత్యారావు, రమేష్ రెడ్డి, ఆత్మ డైరెక్టర్ బాబు, శ్రీను, కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: