మన్యంటీవీ గోవిందరావుపేట/ఏటూరునాగారం:
గోవిందరావుపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు మూరహరి భిక్షపతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి అతిధిగా ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడుతూ
ములుగు జిల్లా కేంద్రంలో ఈనెల 8 వతేదీన జరుగు ఎమ్మెల్సీ సన్నాహక బహిరంగ సభను విజయవంతం చేయాలని మండల అధ్యక్షుడు మురహరి భిక్షపతి అన్నారు.
రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస పార్టీ బలపరిచిన అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపుకోసం ప్రతి ఒక్క కార్యకర్త నిబద్ధతతో పనిచేయలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి సూరపనేని సాయికుమార్, బోనగాని సారయ్య,బొల్లం శివ , ఎల్లవుల రాజశేఖర్, మండల యూత్ అధ్యక్షుడు బానోత్ సంతోష్, గ్రామ అధ్యక్షులు బానోతు వెంకన్న, బండి రాజశేఖర్, రుద్రబోయిన మల్లేష్ గౌడ్, భూరెడ్డి మధుసూదన్ రెడ్డి, గుమ్మడి ప్రసాద్, వర్థం చందర్ రాజు, బండపల్లి సాంబయ్య, కనకయ్య, రాణి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: