టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు ప్రాంతానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు ఎన్ఎన్ రాజు తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం టిఆర్ఎస్వి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నూతనంగా నియమితులైన సందర్భంగా ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతులమీదుగా కరకగూడెం మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ఎన్ఎన్ రాజు ను ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ విద్యార్థులు ఎదురుకుంటున్న సమస్యల కు స్పందించి,ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అదే విధంగా మార్చి 14న జరిగే ఖమ్మం,వరంగల్,నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ విద్యావేత్త పల్లా రాజేశ్వర రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎన్ రాజు కు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చేతులమీదుగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేసుకోవడం జరిగింది. అనంతరం టిఆర్ఎస్వి విద్యార్థి నాయకులు విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ను ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి పినపాక నియోజకవర్గ అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య,ఉప సర్పంచ్ రావుల రవి కరకగూడెం,పినపాక మండలాల అధ్యక్షులు మామిళ్ళ శ్రీకాంత్, యాంపాటీ సందీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పంది సాయిరాం,సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: