వెను తిరిగిన యంత్రాలు, అటవీ అధికారులు...
పోడు రైతులకు అండగా అదికార పార్టీ, సిపిఎం పార్టీ నేతలు...
మన్యం టీవీ : జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలంలో అటవీ శాఖ అధికారులను ఆడుకొన్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. మండలంలోని రాజారావుపేట,సూరారం, గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు గురువారం నాడు పోడు రైతులు సాగుచేసుకుంటున్న పోడు భూమిలో యంత్రాలతో అడవి అభివృద్ధి పనుల పేరు తో కందకాలు తవ్వుతుండగా పోడు రైతులు పార్టీ ల నాయకులు కందకాలు తవ్వుతున్న ప్రదేశానికి వెళ్ళి అటవీ శాఖ అధికారులని యంత్రాలతో తవ్వకుండా అడ్డగించి యంత్రాలను,అటవీ శాఖ అధికారులను వెనక్కిపంపించారు.ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం సభలో రాష్ట్రంలో పోడు రైతులకు పోడు పట్టాలు నూరు శాతం ఇస్తా నాన్న హామీ మరిచిపోయి, అటవీ శాఖ అధికారులతో పోడు రైతులను అడుగడుగున ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నారు. పోడు రైతులకు ఆన్యాయం చేయాలని చూస్తే సిపిఎం పార్టీ నుండి ప్రాణాలను తెగించి పోడు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరాపు కనకయ్య, వైరా నియోజకవర్గ నాయకులు భానోత్ వీరభద్రమ్, సిపియం పార్టీ మండల కార్యదర్శి చిమాలపాటి భిక్షం,మండల నాయకులు ధర్మ, ఉదల వెంకటేశ్వర్లు, కడియాల సత్యం, మండల ఎంపిపి లావుడ్యా సోని,టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, మార్కెట్ కమిటీ సభ్యులు చింతల జగన్నాధం,సరస్వతి,హరిలాల్,రోశయ్య,రాంబాబు,మోహన్,లచ్చిరాం, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: