మన్యంటీవీ,దమ్మపేట:
గ్రామ పంచాయితీ నిధులు అవకతవకలలో సర్పంచ్ ఉప సర్పంచ్ లను జిల్లా కలెక్టర్ యం వీ రెడ్డి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే కాగా కలెక్టర్ ఆదేశాల మేరకు వార్డు సభ్యులలో ఇద్దరినీ సర్పంచ్ ఉపసర్పంచ్ లుగా ఎన్నుకోవాలని కలెక్టర్ యం వీ రెడ్డి ఆదేశాలు జారీ చేయగా శనివారం పంచాయతీ అధికారి బత్తిన శ్రీనివాసరావు పర్యవేక్షణలో సర్పంచ్ ఉపసర్పంచ్ ల ఎన్నిక నిర్వహించారు.ఈదశలో 12 వార్డ్ సభ్యుడు రాజిని రాంబాబు 7 వార్డ్ సభ్యుడు పగడాల రాంబాబు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గా రాజిని రాంబాబు ను ఉప సర్పంచ్ గా పగడాల ఎన్నుకున్నారు. 12 మంది వార్డు సభ్యులు పాల్గొనగా 10 మంది సభ్యులు సర్పంచ్ ఉప సర్పంచ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Post A Comment: