మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన తుడుందెబ్బ నాయకులు
మన్యంటీవీ ఏటూరునాగారం:
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి పంచాయతీ పరిధిలోని రాయి బంధం గ్రామానికి చెందిన పద్దం బోజ్జయ్య కుటుంబం 2002 సంవత్సరంలో వలస వచ్చారని అప్పటినుండి ఐదు ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇటీవల అటవీ అధికారులు వేధింపులు ఎక్కువ అవ్వడం వల్ల భూమి పోతుందనే భయంతో భూమి లేకపోతే ఎలా బ్రతకాలో తెలియక పద్దం ఎర్రమ్మ ఆత్మహత్య చేసుకుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మృతురాలి కుటుంబానికి 10 లక్షలు నష్టపరిహారం ఇప్పించాలని అలాగే అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం డిసెంబర్ 13 2005 కంటే ముందు సాగులో ఉన్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని చట్టం చెప్తుంది. కానీ ఫారెస్ట్ అధికారులు వేధింపులు వల్ల రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని అలాగే 2005 కంటే ముందు సాగులో ఉన్న రైతులకు పట్టాలు ఇవ్వాలని ములుగు జిల్లా తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కబ్బాక శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఉపాధ్యక్షులు వట్టం జనార్ధన్ ఏటూరునాగారం మండల అధ్యక్షులు కబ్బాక రామన్న తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: