మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని ఏజెన్సీ, షెడ్యూల్ ఏరియా ప్రాంతం అయిన కత్తిగూడెం గ్రామంలో గోదావరి ఇసుక క్వారీ గ్రామ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామసభలో ఓటుహక్కు కలిగిన పదముగ్గురు సభ్యులకు గాను తొమ్మిది మంది గ్రామ సభకు హాజరు అయినారు అందులో తొమ్మిదికి తొమ్మిది మంది ఏకగ్రీవంగా శ్రీ ఆంజనేయ ఇసుక క్వారీకి మద్ధతు పలికి చేతులు లేపి తమ ఆమోదం తెలియజేసారు. ఈ ఇసుక క్వారీ గ్రామ సభకు మంగపేట అధికారులు ఎంపీడీఓ ఎండీ ఇక్బల్ హుస్సేన్, ఎంపిఓ శ్రీకాంత్, కత్తి గూడెం పంచాయతీ కార్యదర్శి అజమాల్ తీర్మానం చేసి శ్రీ ఆంజనేయ ఇసుక క్వారీ ని ఏకగ్రీవంగా ప్రకటించారు. పీసా మొబిలైజర్ పున్నం సాంబశివరావు, బాడిశ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: