మన్యంటీవీ ఏటూరునాగారం:
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి మహాత్మా గాంధీవర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలతో శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం జిల్లా కలెక్టరేట్ లోని అధికారులు, సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
జిల్లాలోనిప్రభుత్వకార్యాలయాలలో జిల్లా అధికారులు వారి వారి కార్యాలయాల్లో గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్య్రమానికి ఆర్డిఓ రమాదేవి, డిసిఓ విజయ్ భాస్కర్ రెడ్డి,ములుగు తహశీల్దార్ యం.సత్యనారాయణ స్వామి, కలెక్టరేట్ ఏవో.జె శ్యామ్ కుమార్, సూపరిండెంట్ రాజా ప్రకాష్ మరియు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: