మన్యం టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
ఆదివారం భద్రాచలం పట్టణంలోని ఆదివాసీ గిరిజన అభ్యుదయ భవన్ లో ఆదివాసి నాయకపోడు సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జగ్గా పుల్లయ్య అధ్యక్షతన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసి నాయకపోడు ఉద్యోగస్తుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం జిల్లా ఉద్యోగస్తుల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. భద్రాద్రి జిల్లా ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షులుగా గొల్లమందల శ్రీనివాసరావును, ప్రధాన కార్యదర్శిగా చిటిక నరసింహారావును, ఉపాధ్యక్షులుగా చాదం రాఘవరావు, వేటకాని వరలక్ష్మి, రావుల రాముడు, పలక నాగేశ్వరరావు, సింగ రవిబాబు, బూరుగు పెంటయ్య ను, కోశాధికారిగా కంకటి వెంకన్న ను, మహిళా కార్యదర్శులుగా పాశం సుగుణ, భూరం జ్యోతి, లను ప్రచార కార్యదర్శిగా భూరం ప్రకాష్ రావును, గౌరవ అధ్యక్షులుగా బేతి ఆదినారాయణ, ఇండ్ల సత్యనారాయణ, ను జిల్లా కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీ ఎన్నికల నిర్వహణ అధికారి గా పూసి రమేష్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులు భద్రాచలం సబ్ జైలర్ కూన ఆనందరావు, ములకలపల్లి ఎంపీపీ మట్ట నాగమణి, ఆదివాసి నాయకపోడు సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజిన్ని వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు పిట్టల మరెశ్వరరావు, దబ్బారి రామారావు, కమలాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ గొల్ల పెంటయ్య, జిల్లా నాయకులు మార్తి రాఘవులు, సంగం నాగరాజు, పల్లె శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: