CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐసీడీఎస్ మరియు చైల్డ్ లైన్1098 ఆధ్వర్యంలో లక్ష్మీదేవి పల్లి మండల కేంద్రంలో జాతీయ బాలికా దినోత్సవము ఘనంగా నిర్వహించడం జరిగింది

Share it:

 



మన్యం టీవీ కొత్తగూడెం

లక్ష్మిదేవిపల్లి మండలం సంజయ్ నగర్ గ్రామపంచాయతీ పరిధిలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా

అధికారులు మరియు మహిళ ప్రజా ప్రతినిధులు  జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

 బాలికలు అన్ని అంశాలలో ముందంజలో ఉండాలినీ, ఈ సమాజానికి బాలికలు దిక్సూచిగా ముందంజలో రాణించాలని అదే విధంగా చదువుకునే ఆడపిల్లలు  ఎటువంటి అనవసర విషయాల వైపు ఆకర్షితులు కాకుండా చదువుపై దృష్టి సారించాలి అని చెప్పారు. అదే విధంగా బాలలు ఎవరైనా ఆపదలో ఉంటే చైల్డ్ లైన్ 1098 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించమని తెలిపారు.

ఈ రోజు మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారు. నాటి బాలికలే నేడు అన్ని రంగాలలో ఉన్న అధికారిణి లు, నేటి బాలికలు కూడా వివిధ రంగాలలో ఎదగాలి. అమెరికా ఉపాధ్యక్షులుగా నేడు మహిళలు ఎదిగారు అంటూ గుర్తు చేశారు. 

 ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్  సిడిపిఓ కనకదుర్గ  జిల్లా సమన్వయ కర్త రాజ్ కుమార్ ,లక్ష్మీదేవి పల్లి ఎస్ ఐ   అంజయ్య ,  సర్పంచ్ భూక్యా పద్మ, ఎంపీపీ సొన, ఎం ఆర్ ఓ భద్రకాళి,  లక్ష్మి దేవిపల్లి ఎంపీటీసీ కొల్లు పద్మ , కారుకొండ రామవరం ఎంపీటీసీ స్వాతి, సంజయ్ నగర్ ఎంపీటీసీ భద్రమ్మ , ఐసీడీఎస్ సూపర్ వైజర్ వసంత రాణి, చైల్డ్ లైన్1098 సిబ్బంది, అంగన్వాడి టీచర్స్ పద్మ, సరోజ, సుజాత, అంజమ్మ,  బాలికలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: