CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న బోడ అజయ్ కి ఆర్థిక సహాయం

Share it:

 


బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న బోడ అజయ్ కి ఆర్థిక సహాయం

*హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించిన సీతక్క, నవతరం యూత్ నాయకులు

* లక్షా 20వేల రూపాయల చెక్కు అందజేత

*దాతలు సహాయం చేయాలని సీతక్క పిలుపు

    

మన్యం టీవీ ఏటూరునాగారం:


బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న తాడ్వాయి  మండల కేంద్రానికి చెందిన బోడ నర్సింగరావు, కుమారుడు బోడ అజయ్ కి హైదరాబాదులో కిమ్స్ హాస్పిటల్ బాధపడుతుండగా ఏఐసిసి మహిళ అధ్యక్షురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, తాడ్వాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,  నవతరం యూత్ నాయకులతో కలిసి కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు. అనంతరం నవతరం యూత్ నాయకులు ఆధ్వర్యంలో లక్ష రూపాయలు, తాడ్వాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో 20 వేల రూపాయలు,  మొత్తం ఒక లక్షా 20 వేల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. బోడ అజయ్ ఒక పేద, దళిత కుటుంబానికి చెందిన  విద్యార్థి అని, బ్రెయిన్ క్యాన్సర్ మెరుగైన వైద్యం చేయించుకోవడానికి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని హైదరాబాద్ కిమ్స్ హాస్పటల్ వర్గాలు వెల్లడించాయని పేర్కొన్నారు.  బోడ అజయ్ బ్లడ్ క్యాన్సర్ మెరుగైన వైద్యానికి దాతలు ముందుకు వచ్చి చి ఆర్థికంగా తమకు తోచిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఉదార భావం తో సహకరించాలని కోరారు. గతంలో కూడా బోడ నర్సింగరావు ఇదే బ్లడ్ క్యాన్సర్ వ్యాధి తో  పెండ్లీడుకు వచ్చిన కూతురు ను కూడా కోల్పోయాడని, బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న, అజయ్ కి దాతలు తమకు తోచిన సహాయ సహకారాలు తప్పకుండా అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి పైడాకుల అశోక్, తాడ్వాయి మండలం మాజీ జెడ్ పి టి సి బొల్లు విజయ దేవేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు అర్రెం లచ్చు పటేల్, నవతరం యూత్ నాయకులు కార్తీక్ రెడ్డి,  మనోజ్ రెడ్డి, గంట సాయి రెడ్డి, గట్టు బాలు గౌడ్, వంశీ, శివ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: